SAKSHITHA NEWS

సాక్షిత : పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు,మూడు రోజుల క్రితం నీలం మధు ముదిరాజ్ సొంత మామ చనిపోవడంతో సుష్టి ఉండడంతో సుష్టిలో సుష్టి కలవకూడదనే అంత్యక్రియలకు రాలేకపోయానన్నారు, అనుకోకుండా జరిగిన ఈ ఘటన కుటుంబానికి తీరనిలోటని అన్నారు ఈ సమయంలోనే అందరూ ఆయనకు ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు,విష్ణువర్ధన్ రెడ్డి ఈ అకాల మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు,దేవుడు ఆ కుటుంబానికి మనోధార్యాన్ని కల్పించాలని ఆయన కోరారు.


SAKSHITHA NEWS