మీ అందరి సమిష్టి కృషి వల్లే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం

Spread the love

మీ అందరి సమిష్టి కృషి వల్లే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది….


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారు…
కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …
బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ముమ్మర ప్రచారం – సమిష్టి కృషితో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 85,576 ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎమ్మెల్యే కేపీ.వివేకానంద నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలకు అభినందిస్తూ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్ పల్లి లోని మేకల వెంకటేశం గార్డెన్స్ నందు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానంలో ఇంతటి అపూర్వ విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానన్నారు. ఇది నా ఒక్కడి గెలుపు కాదని… మనందరి సమిష్టి విజయమని తెలియజేశారు. మీరంతా వివేకానంద మా ఇంటి వ్యక్తి అనుకోని ఓటు వేసి, ఇతరులతో కూడా ఓటు వేసేలా వారిని ప్రోత్సహించారు కనుకే నా జీవితంలో మరిచిపోలేని విధంగా రాష్ట్రం మొత్తం కుత్బుల్లాపూర్ గురించి చర్చిస్తూ మన అభివృద్ధి గురించి మాట్లాడుకునేలా చేశారన్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారు. ఇంతలా నా వెంట ఉండి నా గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తల మేలు మరువలేనిదన్నారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, దుందిగల్ కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page