ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది.

Spread the love

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. వంశా తిలక్‌ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2023లో జరిగిన ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ స్థానానికి ఇప్పటికే భారాస, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించాయి. లాస్య నందిత కుటుంబానికే భారాస టికెట్‌ కేటాయించింది. ఆమె సోదరి నివేదిత గులాబీ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నారాయణ శ్రీగణేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది…..

Related Posts

You cannot copy content of this page