పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..

Spread the love

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేంత వరకు నా పోరాటం ఆగదు – కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరై, రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేసారు. అనంతరం రెవెన్యూ అధికారులకి వినతి పత్రం సమర్పించారు.

తొమ్మిదేళ్లుగా పేదవాడికి ఒక్క ఇళ్ళు ఇవ్వలేదని, కట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరాయని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని బీఆర్ఎస్ నాయకులు డబ్బులు దండుకున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో బీఆర్ఎస్ నేతల జోక్యం ఉంటె ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మూగ జయశ్రీ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేకే శేఖర్ యాదవ్, పత్తి రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, బావిగడ్డ రవి, జిల్లా కార్యదర్శి జగన్ మోహన్ రావ్, డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, పున్నా రెడ్డి, పత్తి సతీష్, కంది శ్రీరాములు, రాజేశ్వర్ రావ్, పులి బలరాం, వివిధ మోర్చాల నాయకులు అర్కల సుధా, భానుచందర్, జూల సందీప్, చిలుక, నర్సింగా రావ్, ఐటి సెల్ నాయకులు రామకృష్ణ రెడ్డి, అనూక్, వివిధ డివిజన్ ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page