పది” ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం

Spread the love

జగిత్యాల, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని గత సంవత్సర ఫలితాకంటే మెరుగైన ఫలితమని ఆ పాఠశాల ప్రిన్సిపల్ మమత పేర్కొన్నారు.

విడుదల చేసిన ప్రకటనలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు తమ పాఠశాల నుంచి 71 మంది
విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా ఇందులో సీహెచ్ మోక్షిత, ఏ. సహస్ర లు 10 జిపిఏ సాధించగా నలుగురు 9.8, ముగ్గురు 9.7, ఆరుగురు 9.5/ 9.3 సాధించారని ఐదుగురు 9 జిపిఏ సాధించడం జరిగిందని ప్రిన్సిపల్ మమత పేర్కొన్నారు. పాఠశాల నుంచి పది పరీక్షలకు హాజరైన మిగతా 45 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారని మొత్తంగా హాజరైన 71 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులై వందశాతం రిజల్ట్ రావడం శుభపరిణామమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈ సారి ఉత్తీర్ణత వందశాతానికి చేరిందని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మమత విద్యార్థినులను అభినందించారు.

Related Posts

You cannot copy content of this page