బండి సంజయ్ కుమార్ * చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర

Spread the love


Bandi Sanjay Kumar * The fifth phase of Prajasangrama Yatra

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ * చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర నాల్గవ రోజుకు చేరుకుంది, ప్రజాసమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు ప్రజలనుండి విశేష స్పందన లభిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిజెపి శ్రేణులు సైతం రెట్టింపు ఉత్సాహంతో ఈ పాదయాత్రలో పాల్గొనడం విశేషం, ఇక బుధవారం భైంసా పట్టణంలోని ముందోల్ అసెంబ్లీ-ఒలా గ్రామంలో బండి సంజయ్ కుమార్ వెంట కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జి మాధవరం కాంతారావు * పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ కుమార్ కి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, కేసిఆర్ పాలనలో విసిగి వేసారిన జనం మార్పును ఆశిస్తున్నారు, ఆ మార్పు కేవలం బిజెపితోనే సాధ్యమని, గ్రామానికి చెందిన యువత ఈ పాదయాత్రలో మాతో అడుగులు వేస్తున్నారు,

మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, మునుగోడును దత్తత తీసుకున్న కేటీఆర్ ఎక్కడున్నారు, ఎన్నికల్లుంటేనే ప్రజలు గుర్తుకొస్తొరాంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఈ పాదయాత్రలో శ్రీమతి దేశబత్తుల సుధారవి, హరిబాబు, వినోద్ కుమార్ గౌడ్, శ్రావణ్ కుమార్ గౌడ్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page