శస్త్ర చికిత్సకు చేయూతనిచ్చిన జనసేన పార్టీ ఇన్చార్జి బండి రామకృష్ణ

Spread the love

బండి రామకృష్ణ మాట్లాడుతూ ముంజలూరు గ్రామ నివాసి
బసవ పాండురంగ ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు శస్త్ర చికిత్స చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని నిరుపేద అయిన పాండురంగ పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వైద్యుల సూచన మేరకు 50 వేల రూపాయలతో కాలుకు *శస్త్ర చికిత్స చేపించామని కోలుకునే వరకు కుటుంబాన్ని ఆదుకుంటామని బాధితునికి భరోసా ఇస్తూ పదివేల రూపాయలు నగదును అందజేశామని రామకృష్ణ తెలిపారు

జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాట్లాడుతూ
రాజకీయాల్లో సేవే మార్గంగా జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ పనిచేస్తున్నారని ఇప్పటివరకు 500 కు పైగా గడచిన ఈ ఐదేళ్లలో సేవా కార్యక్రమాలు చేపట్టారని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారని అందులో భాగంగా నిరుపేద అయిన బసవ పాండురంగకు కాలుకు శస్త్ర చికిత్స చేయించి ఈరోజు
మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో10,000వేల రూపాయల నగదును అందించారని గడ్డంరాజు తెలిపారు

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీర్,యూత్అధ్యక్షులు కూనపురెడ్డిప్రసాద్, డివిజన్ ఇన్చార్జులు జనసేన పార్టీ నాయకులు కర్రి మహేశ్,శాయన శివ,కొక్కు లక్ష్మణ్,ఈవనమణిబాబు,బీరం సుదర్శన్,గణేశ్,రాం జ్యోతి, సాయి గణేష్,హర్ష,రాజేష్ తదితరులు పాల్గొన్నారు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page