పినపాక నియోజకవర్గం నుండి బలరాం కి అధిక మెజార్టీ ఖాయం

Spread the love

తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చ నవీన్.

ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అఖిల పక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం.

పార్లమెంట్ ఏన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి ని చేయడమే లక్ష్యంగా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం సూచనలతో తోగూడెం గ్రామ పంచాయితి గోపాలరావు పేట గ్రామంలో జాతియ గ్రామిణ ఉఫాధి హమి పధకం చేస్తున్న కూలీల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధీ బలరాం నాయక్ హస్తం గుర్తు పై ఓటు వేసి అఖండ మోజార్టీతో గెలుపించవల్సిందిగా ఉఫాధి హమీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో న్యాయ్ సూత్రాలను వివరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…బలరాం నాయక్ ని ఎంపిగా గెలిపించే భాధ్యత మనం తీసుకుంటే,కేంద్ర మంత్రి గా తిరిగి పంపించే భాధ్యత సోనియమ్మ తీసుకుంటుంది.ఏజెన్సి గ్రామాలను అభివ్రృధ్ధి చేసిన ఘనత బలరాం నాయక్ దని ఈ సందర్బంగా తెలియచేసారు.ఎండలో పని చేస్తున్న కూలీలకు కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొంపెల్లి నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి నగేష్, అంకతి సమ్మయ్య, వినోద్, పులుగుజ్జు సాంబశివరావు,కొండా భాస్కర్, చింతల వెంకన్న,రేగళ్ల జగన్, సుంకరి శ్రీను,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page