ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

Spread the love

సాక్షిత : ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేట లో,స్థానిక శాసనసభ్యులు శ్రీగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్ ఆధ్వర్యంలోసోమవారం ఘనంగా నిర్వహించారు*

ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ ఆఫీస్ వద్ద,మహాత్మాగాంధీ విగ్రహానికి,గడియార స్తంభం వద్ద అంబేద్కర్ విగ్రహానికి అలాగే గుర్రం జాషువా విగ్రహానికి,బాబు జగజ్జీవన్ రామ్,మహాత్మ జ్యోతిరావు పూలే,మదర్ థెరిస్సా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తారీకు నుండి 15వ తారీఖు వరకు ఆజాదీ క అమృత మహోత్సవం ఈ సందర్భంగా రోజుకి ఒక కార్యక్రమం చొప్పున స్వాతంత్ర సమరయోధులు ని గుర్తు చేసుకుంటూ వ్యాసరచన పోటీలు,క్రీడలు,అవగాహన సదస్సులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలియజేశారు

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మరియు ఈ సంవత్సరం నరసరావుపేట ని జిల్లా గా ప్రకటించిన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర ,ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , జిల్లా సంయుక్త కలెక్టర్ శ్యాంప్రసాద్, డిఆర్ఓ,ఆర్డిఓ,పలు శాఖల జిల్లా అధికారులు ఎమ్మార్వో, కమిషనర్, ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు విద్యార్థులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page