అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుండి 150 మంది బీఆర్ఎస్ లో చేరిక…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం తథ్యం – ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్. నగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఉపాదాక్ష్యుడు, ఎన్.టి.ఆర్. నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇబ్రహీం ఖాన్ ఆధ్వర్యంలో సయ్యద్ జమీర్ వారి బృందం కాంగ్రెస్ నుండి సుమారు 150 మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరిన కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం కాయం అని తెలిపారు.

పార్టీ చేరిన వారిలో షేక్ నబి, అంజత్ ఖాన్, అజి సల్మాన్, ఉపేందర్, సుమీర్, సోహెల్, మోసిన్, కాజా, ఇస్మాయిల్, హుస్సేన్ అలీ, వేణు, రమేష్, రాజు

ఈ కార్యక్రమంలో కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బేగ్, పర్శ శ్రీనివాస్, మూసా ఖాన్, మసూద్, దూలప్ప, గోవర్ధన్ రెడ్డి, దిలీప్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్, చిన్న చౌదరి,నగేష్, సుంకరి చందు, మహేష్, తెలంగాణ సాయి, జునైద్, లక్ష్మణ్, హమీద్, మౌలానా మహిళా నాయకురాలు, ఫార్జ్హన, షమీమ్,మామి, సుజాత, పార్వతి, ఊర్మిళ,ఎన్.టి.ఆర్. నగర్ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ, చంద్రశేఖర్ గౌడ్, తాహెర్, వీరేష్, ఉపేందర్, శ్రీనివాస్ గౌడ్, హాజీ, సల్మాన్, హమీద్ తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 17 At 2.32.38 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page