ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు

Spread the love

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని ధరణి నగర్ వద్ద పరికి చెరువు నాలా పొంగి కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే, ఇప్పుడు ఆ వరద నీరంతా క్లియర్ అయ్యి యదా స్థితికి చేరుకోవడంతో శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అదేశాలమేరకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ జిఎచ్ఎంసి ఎంటమొలజి సిబ్బందితో ధరణి నగర్ లో దోమల మందు మరియు బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకె ప్రమాదముంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇల్లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాజబాబు, నాగేశ్వరరావు, సాయిగౌడ్, అనిల్, ఎంటమాలజి సూపర్వైజర్ డి. నరసింహులు మరియు ఎంటమాలజి సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page