గల బక్షి కుంట చెరువు సుందరికరణలో భాగంగా

Spread the love

As part of beautification of Bakshi Kunta Pond

చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ లో గల బక్షి కుంట చెరువు సుందరికరణలో భాగంగా Phenom people IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపడుతున్న సుందరికరణ పనులను జోనల్ కమిషనర్ శంకరయ్య , డీసీ సుధాంష్ , కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఇరిగేషన్,మరియు GHMC అధికారుల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బక్షి కుంట చెరువు కు దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చేరువుగా తీర్చిదిద్దాడమే ధ్యేయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

Phenom people IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరికరణ చేపట్టుటకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయం అని, సమాజ హితం ,సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయ అని, సాఫ్ట్ వెర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని మరియు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని,ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని

,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మెడికుంట చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .

చెరువు ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు . చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే కి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .

అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని ,

చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగింది .

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు SE శంకర్ నాయక్, DE ప్రవీణ్, AE సంతోష్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు DE నళిని ,AE పావని.AMOH కార్తిక్, Phenom people IT కంపెనీ ప్రతినిధులు రాము బొట్ట, చైతన్య, ఆనంద్ మల్లిగవడ్, శివనంద్,శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు ,

జనార్దన్ రెడ్డి, ఉరిటీ వెంకట్ రావు, ప్రసాద్ , యాదగిరి గౌడ్ ,దాసరి గోపి, మల్లేష్, వెంకటేష్, నాగరాజు, మిర్యాల ప్రీతం, రాంచందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అక్బర్ ఖాన్, పారునంది శ్రీకాంత్, హరీష్ రెడ్డి, నరేందర్ బల్లా, కొండల్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, సందీప్, యశ్వంత్ ,అవినాష్, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి రెడ్డి, పార్వతి మరియు నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page