అత్యుత్తమ పనితీరును సాధించింది దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

Spread the love

సికింద్రాబాద్ సాక్షిత: సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ఈరోజు రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యుత్తమ పనితీరును నమోదు చేయడంద్వారా వివిధరంగాలలో విభిన్న విభాగాలలో అసాధారణమైన పనితీరును కొనసాగిస్తూనే ఉందని తెలిపారు . ముఖ్యంగా, జోన్ రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఈ వృద్ధి సాధించడమే కాకుండా ప్రయాణీకుల మరియు సరుకు రవాణా విభాగంలో క్రీయాశీలకమైన చర్యలు కూడా అత్యుత్తమ ఆదాయాన్ని ఆర్జించడానికి దోహదపడ్డాయి. జోన్ సాధించిన కొన్ని ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
క్రీయాశీలకమైన ప్రణాళిక మరియు వాటి నిర్వహణ ద్వారా అన్ని విభాగాలలో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అంకితభావంతో చేసిన ప్రయత్నాల సహకారంతో జోన్ 2022-23లో రూ.18,973.14 కోట్ల అత్యుత్తమమైన స్థూల ఆదాయాన్ని నమోదుచేసింది,మునుపటి అత్యుత్తమ ఆదాయాన్ని 2018-19లో 15,708.88 కోట్లు.నమోదు చేసింది,2021-22లో జోన్ రూ.14,266 కోట్లు ఆదాయం చేకూరుంది. ముఖ్యంగా జోన్ యొక్క నిర్వహణ నిష్పత్తి కూడా 2021-22లో 98.25% నుండి 2022-23లో 88.23%కి మెరుగుపడింది.


గూడ్స్ షెడ్ అభివృద్ధి, టారిఫ్ మరియు నాన్-టారిఫ్ ప్రోత్సాహక చర్యల అమలు చేయడం వలన సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను పరిష్కరించడానికి జోన్ విభిన్నమైన కార్యక్రమాలను చేపట్టింది. దీని ఫలితంగా కొత్తగారైల్వే ల ద్వారా రవాణా చేసేందుకు వినియోగదారులు మొగ్గుచూపడం జరిగింది. దీనిఫలితంగాదక్షిణ మధ్య రైల్వే 131.854 మిలియన్ టన్నుల అత్యుత్తమ సరుకు రవాణా మరియు రూ.13,051.10 కోట్లఅత్యుత్తమ సరుకు రవాణా ఆదాయాన్ని సాధించింది. మునుపటి అత్యుత్తమ పనితీరు 2018-19లో సాధించబడింది, ఇందులో సరుకు రవాణా మరియు ఆదాయం వరుసగా 122.5 మిలియన్ టన్నులు మరియు రూ. 10,954.69 కోట్లు ప్రయాణీకుల రైళ్ల విభాగంలో దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో 100% మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరిగి ప్రవేశపెట్టిన మొదటి రైల్వే గా నిలిచింది . ప్రత్యేక రైళ్లను నిరంతరం ప్రవేశపెట్టడం, డిమాండ్ ఉన్న రైళ్లలో తాత్కాలిక మరియు శాశ్వత కోచ్‌ల పెంపుదల మరియు రోజువారీ ప్రాతిపదికన అదనపు కోచ్‌లను జోడించడం వంటి చర్యల వలన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రవాణాలో అత్యుత్తమ ఆదాయాన్ని సాధించడంలో దోహదపడింది. రూ.2022-23లో 5,140.70 కోట్లు (గతంలో 2018-19లో అత్యుత్తమ రూ. 4089.78 కోట్లకు పోల్చితే ). ప్రయాణీకుల విషయానికొస్తే, 2021-22లో 127.4 మిలియన్లతో పోలిస్తే 2022-23లో 255.59 మిలియన్ల మంది ప్రయాణీకులు దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రయాణించారు.2022-23 ఆర్థిక సంవత్సరంలో 50.015 కి.మీల కొత్త లైన్లు జతచేయగా,151.486 కి.మీ డబుల్ లైన్ మరియు 182.915 కి.మీ మూడో లైన్లు రైలు నెట్‌వర్క్‌కు జోడించబడ్డాయి. విద్యుదీకరణ ద్వారా2022-23లో దక్షిణ మధ్య రైల్వే లో రికార్డు స్థాయిలో 1,016.9 రూట్ కి .మీలు విద్యుద్దీకరణ చేయడంతో జోన్ విద్యుదీకరణలో మునుపెన్నడూ చూడని వేగవంతమైన అమలువలనఇది ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా జోన్ సాధించిన అత్యధిక విద్యుదీకరణ మాత్రమే కాదు, భారతీయ రైల్వేలో గత ఆర్థిక సంవత్సరంలో అన్ని జోన్లలోకెల్లా అత్యధిక విద్యుదీకరణ కూడాఇంకా, జోన్‌లో రికార్డు స్థాయిలో 1,743.42 రూట్ కి. మీ లు రైలు ట్రాక్ గరిష్టంగాగంటకు130 కి.మీ వేగంతో రైళ్లను నడిపేందుకు అప్‌గ్రేడ్ చేయబడింది.

భారతీయ రైల్వేలో గత ఆర్థిక సంవత్సరంలో అన్ని జోన్లలోకెల్లా అత్యధికం ఇదే. రైలు నిర్వహణ యొక్క సామర్థ్యాన్ని మరియు భద్రతను పెంచడానికి, దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో జోన్ చరిత్రలో అత్యధికంగా 66 ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లను కూడా ప్రారంభించింది.గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ పిఓహెచ్ అవుట్ టర్న్‌ని అందించిన వర్క్‌షాప్‌ల ద్వారా ప్యాసింజర్ మరియు ఫ్రైట్ విభాగాలు రెండింటిలోనూ జోన్ సాధించిన విజయానికి సహకారం లభించింది. లాలాగూడ మరియు తిరుపతి వర్క్‌షాప్‌లు 3,046 కోచ్‌లను సాధించగా, రాయనపాడు వర్క్‌షాప్ 2022-23లో 6,300 వ్యాగన్‌ల పి ఓ హెచ్ అవుట్ టర్న్‌ను సాధించింది.
ఈవిలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్,దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ఆర్.దనంజయులు, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్, బి.నాగ్య,ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.ఆర్.కె. రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కన్స్ట్రక్షన్,నీరజ్అగ్రవాల్ మొదలగువారు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page