APSRTC: ఇంజన్ లో మంటలతో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.

Spread the love

APSRTC: RTC bus burnt down by engine fire..Big accident

APSRTC: ఇంజన్ లో మంటలతో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం

పెదపారుపూడి: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో నుంచి మంటలు రావడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.గుడివాడ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఆ సమయంలో బస్సులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 60 మంది ఉన్నారు. ఇంజిన్‌ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు, విద్యార్థులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.


మంటలు చెలరేగిన నేపథ్యంలో బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలేయడంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

Related Posts

You cannot copy content of this page