ఏప్రిల్ 24 ఛలో ఖమ్మం — టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్

Spread the love

జూలూరుపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైరా నియోజకవర్గ టిపిసిసి సభ్యులు ధరావత్ రాంమ్మూర్తి నాయక్ మాట్లాడుతూ ఈ కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం ఏ మాత్రం జరగలేదని, నిరుద్యోగుల బ్రతుకులతో వారి ప్రాణాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని, నిరుద్యోగులకు అండగా ఈ దొరల ప్రభుత్వ మెడలు వంచడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 24 న ఖమ్మం లో నిరుద్యోగుల కోసం జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీకు ఉద్యోగం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్క నిరుద్యోగి భారీగా తరలి రావాలని, నిరుద్యోగులు తమ జీవితాల్లో వెలుగులు నింపుటకై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అడుగులో అడుగు వేసి ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని, అలాగే వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తరలిరావాలని రాంమ్మూర్తి నాయక్ అన్నారు.

Related Posts

You cannot copy content of this page