SAKSHITHA NEWS

(TSPSC) పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి.

టిడిపి పార్టీ కల్వకుర్తి నాయకులు బాదేపల్లి రాజు గౌడ్.

TSPSC పేపర్ లీకేజీపై స్పందించాల్సిన CM నోరు ఎందుకు మెదపడం లేదు ?
తన కొడుకు నిర్వాకం వల్లే పేపర్ లీక్ అయ్యింది వాస్తవం కాదా?
30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా ?
పేపర్ లీకేజీపై సిట్ విచారణ ఓ ఫాల్స్,కేసీఆర్ సిట్ అంటే సిట్… స్టాండ్ అంటే స్టాండ్ అనడమే సిట్ పని.తెలంగాణలో పోరాటాలను అణిచివేయాలనుకోవడం కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి నిదర్శనం… అక్రమంగా పోలీస్ అరెస్ట్ లతో ప్రజల గొంతు నొక్కలని చూస్తున్న కేసీఆర్.ఇటీవల TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ ఘటన పై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేసి, బాద్యులను కఠినంగా శిక్షించాలని వారికి తగిన న్యాయం చేయాలని,


నిరుద్యోగులు ఏళ్ల తరబడి కడుపు మాడ్చుకొని ఆకలి కేకలు భరిస్తూ కష్టపడి గ్రూప్స్ కి ప్రిపేర్ అయితే కొంతమంది వారి స్వలాభం కొరకు పేపర్ ని లీక్ చేసి లక్షలది నిరుద్యోగులను రోడ్డున పడేసారని తల్లిదండ్రులు కూలీ పనులు చేసి చదివించి ప్రయోజకులు అవుతారని గంపెడు ఆశతో ఉంటే తాగుబోతు పాలన నిర్లక్ష్యం మూలంగా వారి ఆశలు అడియాశలు అయ్యాయని వారికి ఈ ప్రభుత్వ మే సమాధానం చెప్పాలని,BRS నాయకుల అండదండలతోనే ఈ కుట్ర జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని,TSPSC ఛైర్మన్ జనార్దన్ రెడ్డి ని మంత్రి వర్గం నుండి ,ఛైర్మన్ భర్తరఫ్ చేయాలి. కల్వకుర్తి టిడిపి నాయకులు బాదేపల్లి రాజు గౌడ్


SAKSHITHA NEWS