దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

Spread the love

మన తిరుపతి ప్రెస్ క్లబ్ రి. నెం: 15/2022

పత్రికా ప్రకటన

దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

దళితులపై దాడులు సహించబోమంటు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డా” మనవల ఆంజనేయులు నేడు మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ముందుగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా జి. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా హరీష్, ఉపాధ్యక్షులుగా వాసును నియమించారు. అనంతరం
ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డా” మానవల ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై అగ్రవర్ణాలకి చిన్న చూపు ఉందని ఈ భావన రాజ్యాంగ విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ లోని సామాన్య ప్రజలకే కాదు ప్రజా నాయకుల పైన కూడా చిన్నచూపు చూస్తున్నారు ఇదే కోణంలో ఉండవల్లి శ్రీదేవిని ఎలాంటి ఆధారాలు లేకుండా నిందారోపణలు చేసి ఆమెపై బహిష్కరణ వేటు వేయడం సబబు కాదని ఆమెకు అండగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు వాసు, ప్రధాన కార్యదర్శి హరీష్ మరియు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page