ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం…

Spread the love

ప్రతి కాలనీలో మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం…

రూ.1.95 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని విష్ణుప్రియ ఎంక్లేవ్ ( ఆర్కే లేఔట్ ) లో రూ.1.95 కోట్లతో నూతనంగా చేపడుతున్న భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతీ కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కోట్ల రూపాయలను వెచ్చించి ప్రజల అవసరాలను తీర్చుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం అప్పల నాయుడు, మేనేజర్ రోహిణి, కాలనీ ప్రెసిడెంట్ హరికృష్ణ రెడ్డి మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page