SAKSHITHA NEWS

Additional Collector Snehalatha Mogili inspected the school in Tirumalayapalem mandal

తిరుమలాయపాలెం మండలలో పాఠశాలును పరిశీలించిన అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మన వూరు మన బడి పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి తనిఖీ చేసారు.

ఈ సందర్భంగా ఆమె పనుల పురోగతిని పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు . విద్యార్థుల హాజరు శాతం, తరగతి గదిలో విద్యార్థుల బోధనా సరళిని పరిశీలించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సరళీకృతంగా బోధనా ఉండాలని ఉపాద్యాయులకు సూచించారు.

అదనపు కలెక్టర్ వెంట మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాద్యాయులు, ఉపాద్యాయులు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS