శంకర్పల్లి మండల వాసికి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

Spread the love

సాక్షిత శంకర్‌పల్లి: ఒకేసారి మూడు ప్రభుత్వ
ఉద్యోగాలు సాధించాడు ఆ యువకుడు. పట్టుదల,
నిరంతర శ్రమ, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు… శంకర్‌పల్లి మండల పరిధి లోని
రావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన కౌంకుట్ల
శ్రీనివాస్ రెడ్డి.

ఇటీవల వెలువడిన గురుకుల నియామక
ఫలితాల్లో జెఎల్ పీజీటీ, టీజీటీ ఉద్యోగాల్ని సాధించారు. రావులపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ప్రాథమిక విద్య జడ్పీ హై స్కూల్ రావులపల్లి కలాన్
లో చదువగా ఇంటర్, డిగ్రీ వికారాబాద్ లో పూర్తి చేశాడు. పీజీ (మ్యాథ్స్) ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. తల్లిదండ్రులు భారతమ్మ, గోపాల్ రెడ్డిలు రైతులు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతున్న
కష్టాన్ని చూసిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న
లక్ష్యం నెరవేరడం తో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం
చేశారు. కాగా మూడు ఉద్యోగాల్లో జె. ఎల్ (జూనియర్ లెక్చరర్ ) ఎంచుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు .

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page