కుమ్మర సంఘం భవనానికి స్థలం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతి

Spread the love

కుమ్మర సంఘం భవనానికి స్థలం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతి

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి

భవాని కుమ్మర శాలివాహన సంఘం భవనం కోసం స్థలం మంజూరు చేయాలని చిట్యాల భవాని కుమ్మర సంఘం నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెల్లి సత్తయ్య ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి కోరారు. ఎమ్మెల్యే స్పందించి హామీ ఇవ్వడం జరిగిందని సంఘం నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవాని కుమ్మర సంఘం అధ్యక్షులు కమ్మంపాటి నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడూరు చంద్రం, గౌరవ సలహాదారులు ఆరూరి సత్తయ్య, ఆరూరి శ్రీను, కోశాధికారి ఖమ్మం పాటి నరసింహ, నాయకులు బాలకృష్ణ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page