జోరు వానలో కూడా ఆగని కార్యక్రమం.

Spread the love

జోరు వానలో కూడా ఆగని కార్యక్రమం.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వర్షంలో కూడా ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరిస్తూన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పాత, కొత్త నాగిరెడ్డిపల్లె గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఎక్కడా కూడా కుల,మత, పార్టీ లకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధి ని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కోడి కూయక ముందే మా గడప ముందుకు వస్తూ, మా బాగోలు తెలుకోడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, ఎందరో ఎమ్మెల్యే గా పని చేశారు గాని ఇలాంటి ఎమ్మెల్యే లు ఒక్క వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే ఉంటారని నిరుపిస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనా మరియు వినుకొండ నియోజకవర్గ లో మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Related Posts

You cannot copy content of this page