గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Spread the love

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

— నుజ్జైపోయిన మృతదేహం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారు జాతీయ రహదారి 65 పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 01.00 గంటల సమయంలో వెలిమినేడు గ్రామ శివారు లో గల హనుమాన్ గుడి సమీపములో గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 55 సం.లు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు నడుచుకుంటూ వెల్లుతున్న క్రమంలో సదరు వ్యక్తిని హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళే ఒక గుర్తు తెలియని వాహనం డీ కొట్టి వెళ్లిపోగా దానితో శరీరం నుజ్జు నుజ్జు అయి చనిపోయాడు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు
ఎస్.ఐ ఇరుగు రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page