జనసంద్రం మధ్య డా౹౹చదలవాడ “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” సభ

Spread the love

డా౹౹చదలవాడకి హారతులతో కదలి వచ్చిన మహిళలు

జై చదలవాడ జై జై చదలవాడ అంటూ నినాదాలు

ఏం ఉద్దరించారని జగన్ రెడ్డి బస్సు యాత్రలు పెడుతున్నాడని నిలదీస్తున్న ప్రజానీకం

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు చేపట్టిన “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమం జన సంద్రంలా మారింది.మహిళల హారతులు పట్టి స్వాగతం పలికారు.యువత బైకు ర్యాలీలో వార్డులో జన సునామీ సృష్టించారు.నరసరావుపేట పట్టణంలో 14 వార్డ్ కంభంపాలెంలో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.

సామాజిక వర్గాల గొంతు కోసిన జగన్ రెడ్డి…సామాజిక యాత్రలు అంటూ రోడ్డెక్కి మరోసారి పీకలు కోసెందుకు ప్రయత్నిస్తున్నాడు అని డా౹౹చదలవాడ ద్వజమెత్తారు.నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో కనీసం రోడ్డు కూడా వేయలేదన్నారు.తాగునీరు,సాగునీరు కూడా కల్పించలేని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఎవరికి ఉపయోగం అన్నారు.బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల దనమాన ప్రాణాలు తీసిన జగన్ రెడ్డికి సామాజిక యాత్రలు చేసే అర్హత ఉందా అని డా౹౹చదలవాడ ప్రశ్నించారు.ఈ కార్యక్రమం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Whatsapp Image 2023 11 15 At 7.01.07 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page