నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించిన దళిత యువతి

Spread the love

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ముక్కపాటి నగర్ కు చెందిన దళిత యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన బాణావత్ సతీష్. యువతి సతీష్ ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని కోరగా తిరస్కరించిన సతీష్ వారి కుటుంబ సభ్యులు. ప్రేమ పేరుతో మోసపోయిన యువతి కేసు పెట్టడంతో జైలుకు వెళ్లిన యువకుడు బెయిల్ పై తిరిగి వచ్చి బెదిరింపు చర్యలకు పాల్పడిన వైనం. వివరాల్లోకి వెళితే బాణావత్ సతీష్ కు జైల్లో పరిచయమైన నిందితుడిని పరిచయం చేసుకొని, అతని ద్వారా యువతని ఫోన్లో రాజీ చేసుకొని బతికి పో, లేదా నిన్ను చంపేస్తామని ఫోన్లో బెదిరించిన రౌడీ మూకలు. హడలిపోయిన యువతి నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి అంటూ ఏసిపి నాగేశ్వర్ రెడ్డిని ఆశ్రయించిన యువతి. వారికిచ్చిన బెయిల్ ను వెంటనే రద్దు చేయించవలసిందిగా హైకోర్టు న్యాయవాది జై భీమ్ శ్రీనివాస్ ను వేడుకుంటున్న యువతి .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page