SAKSHITHA NEWS

ప్రజా సేవకై ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో – ఎమ్మెల్యే కె పి వివేకానంద్

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.


SAKSHITHA NEWS