SAKSHITHA NEWS

48లక్షల వ్యయంతో అంతర్గత సి సి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన
సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలో 98వ రోజు విశ్వకర్మ కాలనీలో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాలనీలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు అలాగే అక్కడి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా గడిచిన ఏళ్లలో రూ.3కోట్ల 88 లక్షలతో బస్తీల్లో భూగర్భడ్రైనేజీ, మంచినీటి సరఫరా, సీసీ రోడ్ల అభివృద్ధికి కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 48లక్షల వ్యయంతో చేపడుతున్న అంతర్గత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకోకరావాలి అని తెలిపారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఎలాంటి నిధుల కొరత లేకుండా అభివృద్ధి కొనసాగిస్తున్నం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్ గౌడ్, డిఈఈ శిరీష, ఏఈ సంపత్ మరియు స్థానిక డివిజన్ ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మేడ్చల్ జిల్లా మన్నే రాజు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రెటారీ సిద్ధికి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వరాల వినోద్ , మన్నే బాలేష్,, మఖ్సూద్ అలీ, వేణు యాదవ్, ఇంద్రసేనా గుప్త,రవి, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సదానందం, యది రెడ్డి, నర్సింహా, రాములు, వాసు, గిరి, సందీప్, వీరబాబు, మహిళా నాయకులూ షెహనాజ్, లతా, భారతి, కవిత కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS