SAKSHITHA NEWS

హైదరాబాద్: గట్టు మండల బి ఆర్ ఎస్ పార్టీ మైనారిటీ గట్టు మండల అధ్యక్షులు యం డి ఆలిని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు.గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మండల మైనారిటీ అధ్యక్షులు యం డి ఆలికి మొన్న జరిగిన బైక్ యాక్సిడెంట్స్ లో యెడమ చేయికి మరియు కాలికి బలమైన ఫ్యాక్చర్ కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్ళడం జరిగింది.ఈ విషయం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మంత్రి హరీష్ రావు, హైదరాబాద్ గచ్చి బౌలి కన్ టెన్టల్ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న, అలీని పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ లోని డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం గా ఉండాలనీ తెలిపారు


SAKSHITHA NEWS