SAKSHITHA NEWS

ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు. సంజయ్ అరెస్టు నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


SAKSHITHA NEWS