SAKSHITHA NEWS

కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు లోని బండ్లగూడ దోషం చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….


సాక్షిత : బండ్లగూడ దోషం చెరువు వద్ద కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ హయాంలో చెరువుల సుందరీకరణకు అలాగే స్థానికులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేందుకు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ లను నిర్మించడం జరిగిందని అన్నారు. దోషం చెరువు వద్ద కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సుందరమైన వాకింగ్ ట్రాక్ జరుగబోతుందని ఎమ్మెల్యే తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ , డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ , మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ , బండ్లగూడ టౌన్ అధ్యక్షులు గోపాల్, మాజీ సర్పంచ్ లు, మాజీ వార్డ్ మెంబర్లు,పట్టణపుర ప్రముఖులు, పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS