SAKSHITHA NEWS

Disabled people thanked MLA KP Vivekanand

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు


సాక్షిత : దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని సూరారం కాలనీకి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్ వారు ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యలు మొట్ట మొదటి సారిగా ప్రస్తావించిన శాసన సభ్యులు కేపి వివేకానంద్ ని వారు సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్ ఆర్టిసిలో ఒకే బస్ పాస్ పై దివ్యాంగులు అన్ని సర్వీసుల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్ అధ్యక్షులు అంజయ్య గౌడ్, కార్యదర్శి నరేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సత్యం, యాదయ్య యాదవ్, వెంకటరామయ్య, నర్సింగరావు, సారంగపాణి, పాండు, సైమన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ అధ్యక్షులు విసి వీర రాఘవన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS