The problems of students of welfare hostels should be solved
సంక్షేమవసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎస్. శరత్ కుమార్
కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎస్. శరత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించి,అనంతరం జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ కి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎస్. శరత్ కుమార్,సహాయ కార్యదర్శి జి.మునిస్వామి లు మాట్లాడుతూ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, దీంతో విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే వసతి గృహాల గోడలకు కరెంట్ షాక్ వస్తుందని, చాలా సందర్భాల్లో కరెంట్ షాక్ కు కూడా గురికావడం బాధాకరమని అన్నారు.
వసతి గృహాలకు పహారా గోడలు కరువయ్యాయని,అందువల్ల పందులు,కుక్కలు లోపలికి ప్రవేశించడంతో వాటితోనే సహజీవనం చేయాల్సి వస్తుందని అన్నారు. అంతేకాకుండా మరుగుదొడ్లు లేక రోడ్లపైకి వెళ్తున్నారని,దీంతో విద్యార్థులను జనం మందలించడం జరుగుతుందని అన్నారు.అదేవిధంగా మెనూ ప్రకారం ఆహారం అరకొరగా అందుతుందని,అందిన ఆహారంలో కూడా నాణ్యత లోపిస్తుందని అన్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పలుమార్లు అధికారులకు విన్నపించిన, పట్టించుకోకుండా తనిఖీలు చేయకుండా, వారికి సీట్లకే పరిమితమై, వసతి గృహాల విద్యార్ధుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు.విద్యార్థులు వార్డెన్లను అడుగుతే మాకు బిల్లులు రాలేదని చేతులెత్తే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమమే ముఖ్యమని చెపుతుందని, ఆచరించడలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు.కావున సంక్షేమ వసతి గృహాలను నాడు - నేడు పథకం కింద అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కావున అధికారులు స్పందించి, వసతి గృహాలలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరిన్నీ ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
...విప్లవాభివందనాలతో...
ఎస్. శరత్ కుమార్
ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు, కర్నూలు.
సెల్ :- 7993388790
Spread the love సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాల సౌరి గారిని, బోడె ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ…
Spread the love 80కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే పథకాలను బీడు పెట్టిన పెద్దమనిషి ప్రతి మండలంలోనూ కాకాణి అరాచకాలు శ్రుతిమించాయి మా హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇప్పుడంతా రివర్స్ గిరిజనుల భూములను ఫ్యాకర్టీలకు…
Spread the love కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…
Spread the love మహా సుదర్శన యాగంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … కంచికచర్ల పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ కాశీ విశ్వనాధుని (శివాలయం) ఆలయంలో వైయస్ఆర్…
Spread the love కైకలూరు ఎన్నికల ప్రసారంలో ఎంపీ అభ్యర్థి సునీల్ , ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరావు తో కలిసి పాల్గొన్న, ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న కైకలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ , ఎమ్మెల్యే…
Spread the love మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ, కార్యకర్తపెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి ఇటీవల టీడీపీలో చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త…
Spread the love వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం,…
Spread the love అమరావతి: వైసీపీ(YCP ) మేనిఫెస్టోచూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు.. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ…
Spread the love అమరావతి : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా 2 పేజీలలో 9 ముఖ్య మైనా హామీలతో విడుదల అయ్యింది. ఐతే ఈ వైసీపీ మ్యానిఫెస్టో టీడీపీ…