తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మున్షీని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు.
మంత్రి జూపల్లి వెంట కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
![](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-03-at-2.08.00-PM-1024x684.jpeg)