SAKSHITHA NEWS

లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశం.

సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌లో పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, పార్టీ నేతలు హరీశ్‌ రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వినోద్ కుమార్, జోగు రామన్న తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS