SAKSHITHA NEWS

అభివృద్ధికి లక్ష్యమే ఈ ప్రగతి యాత్ర – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పర్యటన…

పాదయాత్రలో భాగంగా 129 – సూరారం డివిజన్ పరిధిలోని కళావతి నగర్ మరియు టిఎస్ఐఐసి కాలనీలో రూ. 84.10 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించనున్న సీ.సీ. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ లో పరిధిలోని కళావతి నగర్ మరియు టిఎస్ఐఐసి కాలనలో 95వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పర్యటించి రూ. 84.10 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న సీ.సీ. రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు అనంతరం టిఎస్ఐఐసి కాలనీ శ్రీ వెంకటేశ్వరా స్వామి టెంపుల్ కమాన్ నిర్మాణాకి శంకుస్థాపన చేసారు అదేవిదంగా ఎమ్మెల్యే సొంత నిధులతో బోరు ఏర్పాటు చేసి నల్లా కనెక్షన్ ని ప్రారంభించారు.

తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు గాను ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తూ ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 9 ఏళ్లలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను డివిషన్లలో చేపడుతున్నట్లు, ప్రజా సౌకర్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు, సౌకర్యవంతమైన రహదారులు, త్రాగునీరు, మెరుగైన విద్యుత్, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులతో ప్రతి డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిదుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు HMWS GM శ్రీధర్ రెడ్డి, DEE శిరీష, AE సంపత్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రెటారీ సిద్ధిక్, సీనియర్ నాయకులు చెక్క సురేష్ బాబు, గిరిధర్, మధు మోహన్, రెహ్మాన్, నేతి రాజు, సాయి బాబా, సి శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, యాదగిరి, మహేష్, శ్రీను, ముకుందం, రవి, ఎల్లమ్మ, మరియు కాలనీల వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS