విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

Spread the love

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

గట్టు:-గట్టు మండలం తుమ్ముల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్ (22) అనే యువ రైతు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగ యువకుడి మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి విద్యుత్ తీగలు పై పడి ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. పోస్టు మార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలిస్తున్నట్లు గట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page