మౌలిక వసతుల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తా : ఎమ్మెల్యే

Spread the love

మౌలిక వసతుల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తా : ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధికి చెందిన బాపూనగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం, కమ్యూనిటీ హాల్, మిగిలిన సీసీ రోడ్ల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణా యాదవ్, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, జైపాల్ రెడ్డి, రాజు యాదవ్, రమణ్, లలిత, సరిత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page