కోటమర్పల్లిలో కోటి రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, 73 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20 లక్షల నిధులతో వేసిన నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర స్వపరిపాలనలో పల్లెలు పటిష్టమైన అభివృద్ధితో ప్రగతిపధంలో నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో స్థానికతను బలపరుస్తూ… మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.

అనంతరం కోటమర్పల్లి గ్రామంలో BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page