శక్తివంతమైన యువత నేటి సమాజానికి అవసరం – వడ్త్య దేవేందర్ నాయక్

Spread the love

దేవరకొండ సాక్షిత ప్రతినిధి

దేవరకొండ మండలం పడమటపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ని మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దేవేందర్ నాయక్ మాట్లాడుతూ శక్తి వంతమైన యువత నేటి సమాజానికి అవసరమని అన్నారు. ప్రపంచం భారతీయ యువ శక్తికి దాసోహం అంటుందని గుర్తు చేశారు. యువత వృత్తి జీవన నైపుణ్యాలను అలవర్చుకొని అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. అదేవిధంగా సమాజంలో సమూలమైన మార్పులు తేవడానికి చైతన్యం కలిగిన యువకులు ఉత్సాహంగా రాజకీయాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు రాజకీయ చైతన్యం ద్వారానే ప్రజలకు మెరుగైన జీవనం అందించవచ్చని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో యువతకు చేయూతనందిస్తుందని అన్నారు. యువకులు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ యువ పారిశ్రామికవేత్తలను దేశానికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె నరేష్, పల్లె ప్రసాద్, పల్లె అరుణ్, పల్లె సాయి బాబు, పల్లె సాయి కుమార్, పల్లె రాకేష్, కిన్నెర ప్రవీణ్, ఇప్పలపల్లి ఆంజనేయులు, వడ్త్య నాగరాజు తదితరుల పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page