కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాలా రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమం.

Spread the love

నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,వొడితల ప్రణవ్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ , ఆరేపల్లి మోహన్ , కరీంనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ పురిమల్ల శ్రీనివాస్ ఇతర ముఖ్య నేతలు…

నామినేషన్ కార్యక్రమానికి భారీగా హాజరైన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు…

సర్కస్ గ్రౌండ్ నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు..

డప్పు చప్పుళ్ళు, కళాకారుల ఆటపాటల తో నామినేషన్ ర్యాలికి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ..

మంత్రి పొన్నం ప్రభాకర్

పార్లమెంట్ మొదటి దశ ఎన్నికలు పూర్తికాగానే నరేంద్ర మోడీ కి బయం పట్టుకుంది..

10 సంవత్సరాలు ప్రధానమంత్రి గా చేసిన వ్యక్తి దేశానికి చేసింది చెప్పుకునే పరిస్థితుల్లో లేరు..

మోడీ మాటలు చూస్తే దేశం సిగ్గుపడే పరిస్థితి ఉంది..

కాంగ్రెస్ వస్తె సంపద అంతా ముస్లిం లకు ఇస్తారని చెబుతున్నారు..

85 శాతం హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ప్రధాన మంత్రి గా ఉండి హిందువులకు ఎం నిర్ణయం తీసుకొని ఏం చేశావో చెప్పు..

మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మెజారిటీ హిందువుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు..

సంపద అంతా దేశ ప్రజలకు ఉపయోంచకుండా సంపద అంతా అదానీ అంబానీలకు పంచి పెట్టారు..

10 సంవత్సరాల్లో అదానీ అంబానీ లకు తప్ప ఎవరికైనా పేదలకు ఏమైనా చేశావా..

మత సామరస్యాన్ని చెడగొట్టి కాంగ్రెస్ వస్తె సంపద అంతా ముస్లింలకు ఇస్తారనే అభద్రతా భావం సృష్టిస్తున్నారు..
మా మేనిఫెస్టో చూసి లాగులు తడిసాయి..

ముస్లిం మేనిఫెస్టో అంటారు..

పాంచ్ న్యాయ్ ద్వారా దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు

ఎవరు ఎంతో వారికంత అని రాహుల్ గాంధీ అంటే దానిని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు…

దేశంలో 10 సంవత్సరాల బీజేపీ రాష్ట్రం లో 10 సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఏం చేశాయో చెప్పాలి..

తెలంగాణ విభజనను వ్యతిరేకించి అమరవీరులకు అవమానపరిచేవిధంగా దొంగ దారిన రాష్ట్రాన్ని తెచ్చుకున్నారన్న నరేంద్ర మోడీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటేయలా..

10 సంవత్సరాల్లో విభజన హామీలు అమలు చేయలేదు..

7 మండలాలతో పాటు ,సీలేరు ప్రాజెక్ట్ ను ఆర్డినెన్సు ద్వారా ఎత్తుకుపోయిన మీరు తెలంగాణ ద్రోహులు..

స్థానిక పార్లమెంట్ సభ్యుడిని
నీ అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణల వల్లే తీసేసారో లేదో చెప్పాలి

ఈ 5 సంవత్సరాల కాలంలో కరీంనగర్ పార్లమెంటు కి ఏం చేశావో చెప్పాలి..

ఒక్క పని అయినా ప్రజలకు ఉపయోగపడేది చేశావా .

బాత్రూమ్ లు కట్టినమా.. అక్షింతలు పంచినమా ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు .

ప్రజలకు చిరస్తాయిగా ఉండేటువంటిఒక విద్యాసంస్థ ..వైద్య సంస్థ ,ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ తెచ్చినవా…

ఎక్కడికెళ్లినా రాముడి ఫోటోలు పెట్టు..రాముడి పేరు మిద ఓట్లు అడుగుతూ ..రాముడి పేరు మిద ఓట్లు అడుగతలెం అంటుండు ..

అసలు నీకు మానవత్వం లేదు..

మానవత్వం ఉన్న ప్రతి బిడ్డ తల్లికి గౌరవం ఇస్తది..

ఎవరైనా బిడ్డ పుడితే ఆ తల్లికి నర్స్ పోయి చెబితే బిడ్డ పుట్టిందని తెలుస్తుందన్న అవివేకి..

బీజేపీ వెంట సీనియర్లు ఉన్నారా..

కాంగ్రెస్ పార్టీ వెంట ప్రతి కార్యకర్త..ప్రతి ఎమ్మెల్యే ..మాజీ శాసన సభ్యులు .పోటీ చేసిన నేతలు అందరం కలిసి ఉన్నాం..

ఈరోజు విద్యార్థి దశ లో ఉన్న రామకృష్ణ ఎక్కడ , సుగునకర్ ఎక్కడ , విద్యాసాగర్ రావు ఎక్కడ ,మురళీధర్ రావు ఎక్కడ ..

నీ పక్కన మొరిగే వాళ్ళతో మాట్లడిస్తున్నావ్..

నాకన్నా పెద్ద భక్తుడివి అనుకుంటున్నావు కదా నేను వారానికి రెండు రోజులు తిరుపతి రైలు తెచ్చిన .. దానినిరోజు నడిచేలా ఎందుకు చేయలేదు..

నేను సిరిసిల్ల ,కరీంనగర్ కి కేంద్రీయ విద్యాలయం తెచ్చా..

హుజూరాబాద్ కి ,జమ్మికుంటకి ఎందుకు తేలేదు..? మీ ప్రభుత్వమే కదా..

యూనివర్శిటీ తెచ్చినం..దానికి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజి తేలేకపోయావ్..

5 ఏళ్లు ఎంపిగా ఉండి వస్త్ర పరిశ్రమ కి పన్ను వేస్తే దానిని వ్యతిరేకించాలని దద్దమ్మ వి నువ్వు..

పైసలతో ఓట్లు కొనుక్కోవాలనుకున్న వ్యక్తి..6 కోట్లు దొరికినవి .

ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..

5 ఏళ్ళు ప్రణాళిక బోర్డు మెంబర్ గా కూడా చేశారు మీరు ఈ నియోజకవర్గానికి చేశారు..వినోద్ రావు కి ఓటు ఎందుకు వేయాలి ..

మీ నియోజకవర్గ ఒక జడ్పీటిసి నీ అయినా గుర్తుపడతావా..

ఒకరికి అయిన షేక్ హాండ్ ఇస్తావా..

నియంతలాగ వ్యవహరించిన మీరు నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్నారు .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన అందిస్తున్నాం .

ఇచ్చిన గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నాం..

బీజేపీ వాళ్లు కరపత్రాలు పంచుతున్నారు..

యెస్ బరా బర్ హామీలు అమలు చేస్తున్నాం .

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం ,500 కి గ్యాస్ అందిస్తున్నాం ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం..

10 లక్షల ఆరోగ్య శ్రీ అందించాం..

3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం
రేషన్ కార్డులు ఇస్తున్నాం..

ఆగస్టు 15 నాటికి 2 లక్షల రైతు రుణమాఫీ తో పాటు..500 బోనస్ ఇస్తాం..

రైతులకు వ్యతిరేకంగా నల్లా చట్టాలు తెచ్చి రైతులు చనిపోతుంటే మాట్లాడినవా ..

నరేంద్ర మోడీ గొపోడు అయితే ఈ 10 సంవత్సరాల్లో దేశానికి ఏం చేశావో చెప్పాలి..

రైతులకు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇచ్చీమవా.. రైతులకు 22 పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే ఇంకో పంటకి ఇచ్చావా..

మాటలకే పరిమితం అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి..

నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి..శాంతి భద్రతలు కరువయ్యాయి ..

విద్వేషాలతో కూడుకొని రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది..

కరీంనగర్ లోక్ సభ ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ గెలిపించండి..

మీ ప్రధాని అభ్యర్థి నియంత మోడీ అయితే..నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ..

పార్టీ సూచనలు మేరకు నామినేషన్ వేశాం..

రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి అవకాశం ఇవ్వండి..

నియోజవర్గం మీద అవగాహన ఉంది..

ప్రతి కార్యకర్త పార్లమెంట్ లో ఎల్లారెడ్డి నుండి మొదలు ఎల్కత్తూరి వరకు మల్యాల నుండి మొదలు బెజ్జంకి వరకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని..

ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నవాడికి ఓటుతో బుద్ధి చెప్పాలి .

పార్లమెంట్ నియోజకవర్గంలో
రేపటి నుండి డిసిసి అధ్యక్షులు , కవ్వంపల్లి సత్యనారాయణ , ఆది శ్రీనివాస్ కార్యక్రమాలు తీసుకుపోతారు..

అన్ని బూత్ లలో మెజారిటీ సాధించాలి..

అన్ని మండలాలు గ్రామాలు తిరుగుతాం..

కరీంనగర్ కాంగ్రెస్ కి కంచుకోట.. ఈ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

పార్లమెంట్ పరిధిలో 4 గెలిచాం.. ఉమ్మడి జిల్లాలో 13 కి 8 ఎమ్మేల్యేలు గెలిచాం ..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి..

Related Posts

You cannot copy content of this page