SAKSHITHA NEWS

Values ​​- Chief Minister Y.S. is leading a credible administration

విలువలు –విశ్వసనీయతతో కూడిన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి .


సాక్షిత : బొల్లాపల్లి మండలం గండిగనుమల సచివాలయం పరిధిలోని దోమలగుండం తండా, దోమలగుండం, షోలాయపాలెం, పైతండా గ్రామాల్లో “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .

“గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక -ఆదర్శ పాలన సాగిస్తున్నారని, ఎక్కడా కూడా కులాలు చూడకుండా మతాలు చూడకుండా, పార్టీ లు చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.


అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విలువను విశ్వసనీయతతో కూడిన పరిపాలన చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన హామీలలో 98 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ని అన్నారు. అందుకే ప్రజల హృదయాల్లో ఉత్తమ స్థానం సంపాదించుకున్నారన్నారు.

ఏ ఒక్క సామాజిక వర్గానికి కొమ్ము కాయకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు ,ప్రజా సమస్యలను విన్నవించగానే తక్షణమే స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.
అలాగే వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి మనం ఎల్లప్పుడూ తోడుగా నిలవాలని కోరారు.


SAKSHITHA NEWS