సప్తగిరి కానీల లో HMWS & SB వారి ఆధ్వర్యంలో రూ. 60 లక్షల రూపాయల అంచనావ్యయం

Spread the love


Under the guidance of HMWS & SB in Saptagiri Kanila Rs. Estimated cost of Rs 60 lakhs

*సాక్షిత : *హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడా విలేజ్ మరియు సప్తగిరి కానీల లో HMWS & SB వారి ఆధ్వర్యంలో రూ. 60 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ మరియు జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అని, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ద్వారా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగినది

,వాటర్ వర్క్స్ బోర్డ్ నిధుల ద్వార మంజూరు అయిన నిధులతో చేపడుతున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఎన్నో సంవత్సరాల నుండి నెలకొన్న సమస్య నేటి తో తీరునని కాలనీ వాసుల కోరిక మేరకు పాత మంచి నీటి పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ వేయటం జరిగినదిఅని,ఎన్నో ఏండ్ల కలుషిత నీటి సమస్యనుండి నేటి తో విముక్తి లభించింది

అని ఇకనుండి సురక్షిత మంచినీరు ఇవ్వడం జరుగుతుందని కాలనీ వాసుల సమస్య నేటి నుడి తీరనుందని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది.అదేవిధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెచ్చిన కార్యక్రమం అని, నెలకు 20,000 ల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చేసి లబ్ది పొందేలా చూడలని, ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని

, ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కలిపించాలని, పేదవాడలలో నివసించే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని, అదేవిదంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్ల కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేపట్టడం జరుగుతుందని మరియు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటి ని ఇవ్వడం జరుగుతుందని ,మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్లు ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని .

నియోజకవర్గం లో 18 రిజర్వాయర్ లు నిర్మాణం చేసుకున్నామని .ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ,మరియు నియోజకవర్గం లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తామని చెప్పడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి DGM నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరి , హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్ రావు , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి,అక్తర్, దొంతి శేఖర్, వెంకట్ యాదవ్, బాబు మోహన్ మల్లేష్, కృష్ణ ముదిరాజ్,రామకృష్ణ గౌడ్,రవీందర్ రెడ్డి, షేక్ జామీర్,యాదగిరి ముదిరాజ్,శ్రీనివాస్ గౌడ్,బాలరాజు యాదవ్,

జనార్దన్ గౌడ్,వెంకటేశ్వర్ రావు, దామోదర్ రెడ్డి, ఆశీల శివ,గోపాల్ యాదవ్,సాయి యాదవ్,ప్రసాద్,వెంకట్ యాదవ్,విగ్నేశ్వర్ రెడ్డి,రాజధర్మ రెడ్డి,సంజీవ రెడ్డి,రవీందర్ రెడ్డి,సుదర్శన్ రాజు,నాగభూషణం,వెంకట్ సుబ్బయ్య,ఆంజనేయులు,వెంకటేశ్వర్లు,నందు నాయక్,శ్రీరాములు,నర్సింలు,శ్రీనివాస్,సంజీవరెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page