పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

Spread the love

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ 25 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య కి ఓటు వేసి ప్రజాస్వామ్య వాదికి తోడుగా నిలబడి మనమందరం కళ్యాణదుర్గం అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ముందడుగు వేద్దామని తెలియజేశారు. అదేవిధంగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేంద్రబాబు బడా కాంట్రాక్టర్ గా ఉంటూ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ జెండా చేత పట్టుకోకుండా రాజకీయ విలువలు తెలియనటువంటి వ్యక్తి సురేంద్రబాబు ఏదైనా డబ్బుతో టికెట్టు కొనవచ్చు ఓటర్లను కొనవచ్చు అనే ధోరణితో ఉన్న వ్యక్తి సురేంద్రబాబు అటువంటి వ్యక్తి కళ్యాణదుర్గం ఆత్మగౌరవం విలువలు తెలియని అటువంటివారిని ఇంటికి సాగనంపి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థినీ గెలిపించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page