SAKSHITHA NEWS

హైదరాబాద్ :
వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు..

ఈ క్రమంలోనే సాయం త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసు కొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు.

రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు


SAKSHITHA NEWS