ట్ర‌స్టు బోర్డు సేవ‌లు భేష్ మంత్రి ధర్మాన ప్రసాదరావుశ్రీ కూర్మ ఆల‌యంలో నిత్యాన్న‌దానానికి ఏడాది

Spread the love

ట్ర‌స్టు బోర్డు సేవ‌లు భేష్ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీ కూర్మ ఆల‌యంలో నిత్యాన్న‌దానానికి ఏడాది

ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం శ్రీకాకుళం జిల్లా శ్రీ‌కూర్మం దేవ‌స్థానంలో మంత్రి ధ‌ర్మాన చొర‌వ‌తో ప్రారంభించిన నిత్యాన్న‌దాన కార్య‌క్ర‌మానికి గురువారంతో ఏడాది పూర్తయిన వేళ ప్ర‌త్యేక కార్యక్ర‌మం ఏర్పాటు చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ధ‌ర్మాన మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కూ, యాత్రికులకూ భోజ‌న వ‌స‌తి క‌ల్పించడం ఆనందంగా ఉంది. దాత‌ల స‌హ‌కారంతో ఇటువంటి స‌మున్నత కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌గ‌లిగాం.ఇందుకు సంబంధించి ట్ర‌స్టు ఏర్పాటు చేసి,ఈ కార్య‌క్ర‌మాన్ని నిరాటంకంగా చేస్తున్నాం. ఈ విష‌య‌మై ట్ర‌స్టు బోర్డు మెంబ‌ర్లు చేస్తున్న కృషి ఎంతో స‌మ‌ర్థంగా ఉంది. వారి కృషి కార‌ణంగానే రుచిక‌ర‌మైన, శుచిక‌ర‌మైన భోజ‌నం అందించ‌గ‌లుగుతున్నాం.

Related Posts

You cannot copy content of this page