SAKSHITHA NEWS

జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కనికెళ్ల భాస్కరరావు ఇటీవల మృతిచెందారు.

నేడు కవులూరులో ఆయన నివాసంలో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS