పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు

Spread the love

కృపావరానికి ఘన సన్మానం
అభినందనలు తెలిపిన మంత్రి అంబటి

: *సాక్షిత సత్తెనపల్లి :
పట్టణ వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులుగా గుజ్జర్లపూడి కృపావరం నియామకం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్సీపి పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి ఆధ్వర్యంలో రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు ఆయనకు పూలమాలవేసి అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు . ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ కృపావరం ఎప్పటి నుంచో పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నాడని, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పట్టణములో పార్టీని బలోపేతం చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వైఎస్ఆర్సిపి అండగా ఉందని,, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కృపవరం ఎంపిక పట్ల మిత్రులు , నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కృపావరం మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన మంత్రి అంబటి రాంబాబు కు రుణపడి ఉంటానని , పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని వివరించారు. కార్యక్రమంలో ఎస్సి సెల్ నాయకులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు కౌన్సిలర్లు, తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page