మౌలిక వసతులు కల్పించాలని గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి..

Spread the love

మౌలిక వసతులు కల్పించాలని గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ 28వ వార్డ్ పరిధి చర్చి గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన బస్తి వాసులు సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులు మరియు మంచినీటి సరఫరా పైపులైన్ ఏర్పాట్లు కృషి చేయాలని కోరుతూ ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కరీమా, మురళి, భారతి మరియు బస్తీవాసులు, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page