కరెంటు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన మూడు దుకాణాలు…

Spread the love

Three shops burnt due to electric short circuit…

కరెంటు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన మూడు దుకాణాలు…

మానవతా దృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ఒక్కో దుకాణానికి రూ.50 వేల చొప్పున లక్షా యాభై వేల ఆర్థిక సాయం అందజేత…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేస్-1లో జరిగిన కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా హెచ్.ఆంజనేయులుకు చెందిన మెన్స్ సెలూన్ షాప్, ఆర్.జాంపయ్యకు చెందిన స్క్రాప్ దుకాణం, కె.కృష్ణ కుమార్ కు చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు దగ్ధం అయ్యాయి.

దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. నిరుపేదలు కావడంతో మానవతాదృక్పథంతో స్పందించి ఒక్కో దుకాణానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ సత్తిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page