నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Spread the love

The welfare of the poor is the mission of the government

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రూ.31.72 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 62 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.31,72,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు మరియు నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page